© 2026 nimisham.in

మనం రోజూ ఎన్నోసార్లు కరెన్సీ నోట్లను వాడుతుంటాం. ముఖ్యంగా రూ.100, రూ.200, రూ.500 నోట్లను చేతిలోకి తీసుకున్నప్పుడు వాటి అంచుల వద్ద కొన్ని గీతలు, గుర్తులు ఉండటాన్ని గమనించే ఉంటాం. చాలామంది
ఇవి నోట్ల డిజైన్లో భాగమని లేదా అలంకరణ కోసం వేశారని అనుకుంటారు. కానీ, ఆ గుర్తుల వెనుక ఓ ముఖ్యమైన, మానవతా దృక్పథంతో కూడిన కారణం ఉంది. దృష్టి లోపం ఉన్నవారు కూడా నోటు విలువను సులభంగా గుర్తించేందుకే ఆర్బీఐ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.కరెన్సీ నోట్లపై ఈ గుర్తులను 'ఇంటాగ్లియో' లేదా రైజ్డ్ ప్రింటింగ్ పద్ధతిలో ముద్రిస్తారు. అంటే.. ఆ గుర్తులు కాస్త ఉబ్బెత్తుగా ఉండి, చేతివేళ్లతో తాకినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. దృష్టి సమస్యలు ఉన్నవారు నోటును చేతిలోకి తీసుకుని, దాని అంచులను వేలితో తాకడం ద్వారా ఆ గుర్తులను స్పర్శించి, అది ఏ నోటో కచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి నోటుకు వేర్వేరు గుర్తులు ఉండటం వల్ల వారు ఇతరులపై ఆధారపడకుండా, మోసపోకుండా తమ లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు.ఉదాహరణకు రూ.100 నోటు అంచుల్లో ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే గీతలను మనం స్పర్శించవచ్చు. ఇక రూ.200 నోటుపై ఈ గీతలతో పాటు రెండు సున్నాలు కూడా ఉంటాయి. అత్యధిక చలామణిలో ఉండే రూ.500 నోటు విషయానికొస్తే, దాని అంచుల వద్ద ఏటవాలుగా ఉండే ఐదు గీతలను ముద్రిస్తారు. ఇలా ఒక్కో నోటుకు ఒక్కో రకమైన గుర్తును కేటాయించడం ద్వారా అంధులు సులభంగా తేడాను గుర్తిస్తారు. కేవలం ఈ నోట్లపైనే కాకుండా, ఇతర అధిక విలువ