© 2026 nimisham.in

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది.
అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో ఇది ఏర్పడటం వలన వీరు అనే ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు. అందువలన వీరు గ్రహణం పూర్తి అయ్యే మరసటి రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలంట.
కన్య రాశి : కన్యారాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణానికి ముందు ఖర్చులు అధికం అవ్వడం మానసిక ప్రశాంతత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.
సింహ రాశి : సింహ రాశి వారికి అపనిందలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో అనేక సమస్యలు ఎదుర్కుంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు