
పళ్ల బురుసు' అమెజాన్ప్రైమ్ మూవీ రివ్యూ
'బలగం' సినిమాతో సుధాకర్ రెడ్డికి - మురళీధర్ గౌడ్ కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ నేపథ్యంతో కూడిన సినిమాలలో వాళ్లకంటూ ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లిద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన సినిమానే 'పళ్ల బురుసు'. ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (సెప్టెంబర్ 2)వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అది తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లెటూరు. అక్కడ శంభూ (సుధాకర్ రెడ్డి) అనే రైతు నివసిస్తుంటాడు. శంభూకి తిరుపతి (మురళీధర్ గౌడ్) అనే కొడుకు ఉంటాడు. ఆయన భార్య మారుతి .. కూతురు 'రేఖ' ఇదే ఆయన కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగి అయిన తిరుపతి, తన తండ్రిని గురించి పెద్దగా పట్టించుకోడు. అందువలన శంభూ వేరే ఉంటూ, తనకున్న 'ఎకరం భూమి'ని సాగుచేసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా 'పంటి' సమస్యతో ఆయన బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం 'పళ్ల బురుసు'(టూత్ బ్రష్) వాడాలని నిర్ణయించుకుంటాడు.శంభూ తనకి 'పళ్ల బురుసు' తెచ్చిపెట్టమని తిరుపతికి చెబుతాడు. అయితే అతను తన కూతురు 'రేఖ' పెళ్లిపనులలో ఉండటం వలన తీసుకురాలేకపోతాడు. ఉద్దేశ పూర్వకంగానే తన తండ్రిని పెళ్లికి పిలవడం మానేస్తాడు. తన మనవరాలి పెళ్లికి తనని పిలిచేదేమిటని భావించిన శంభూ ఆ పెళ్లికి వెళతాడు. అయితే తనని పట్టించుకోవడం మానేశారనే బాధ లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. దాంతో అతను తన కొడుకు తనని పట్టించుకోవడం లేదంటూ కోర్టులో కేసు వేస్తాడు. తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం తిరుపతిని షాక్ కి గురిచేస్తుంది.కూతురు పెళ్లి కోసం అయిన అప్పును తీర్చడం కోసం తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేయాలని తిరుపతి భావిస్తాడు. తాను బ్రతికుండగా ఆ పొలాన్ని అమ్మేయడానికి ఒప్పుకోనని శంభూ తేల్చి చెబుతాడు. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? శంభూ ఎలాంటి